వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని కడసారి చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు, మాజీ మంత్రి అమర్నాథ్తో సహా పలువురు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మృతదేహానికి ఘనంగా నివాళులర్పించారు. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఆర్మీ అధికార లాంఛనాలతో ప్రవీణ్ కుమార్ రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.