: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధన (63; 55 బంతుల్లో 9×4, 1×6) సొగసుగా బ్యాటింగ్ చేస్తోంది. అద్భుత ఫామ్లో ఉండి గాయం కారణంగా ఆర్నెల్లు జట్టుకు దూరమైన ఆమె ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న ఆరంభ పోరులో అర్ధశతకం సాధించింది. తొలి నుంచీ దూకుడు కనబరిచిన స్మృతి 45 బంతుల్లోనే 50 పరుగుల మార్కు దాటేసింది. 48 పరుగుల వద్ద గన్ వేసిన 16వ ఓవర్ చివరి బంతికి చక్కని బౌండరీ బాది అర్ధశతకం పూర్తిచేసింది. ఈ ప్రపంచకప్ టోర్నీలో తొలి అర్ధశతకం, సిక్సర్ ఆమెదే కావడం విశేషం. షివెర్ వేసిన 5.1వ బంతిని లాంగాన్లో భారీ సిక్సర్గా మలిచింది స్మృతి. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ (31; 65 బంతుల్లో 3×4) ఆచితూచి ఆడుతోంది. 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది.