ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్ని పార్టీల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అందరి సలహాలు,సూచనలను ఆయన తీసుకున్నారు. కరోనా పై ప్రస్తుత పరిస్థితిని వారికి ప్రధాని వివరించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష నేతలు లాక్ డౌన్ పొడిగించాల్సిందేనని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 11న సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి లాక్ డౌన్ పై నిర్ణయాన్ని ప్రకటిస్తామని ప్రధాని అన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదని మాత్రం ప్రధాని ప్రతిపక్ష నేతలతో మోదీ అన్నారు. దీంతో ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగవచ్చని తెలుస్తోంది.