ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూప్‌-2 వివరాల సవరణకు 31వరకు గడువు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 18, 2017, 02:29 AM

అమరావతి, మేజర్‌న్యూస్‌ః గ్రూప్‌-2 (2016) నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్య ర్ధులు తమ వివరాల్లో మార్పులుచేర్పులు చేసు కొనేందుకు ఈనెల 31వ తేదీవరకు గడువును పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. పోస్టు, జోన్‌, జిల్లా వివరాలకు సంబంధించి పొరపాట్లు జరిగి ఉంటే సరిచేసుకోవచ్చని వివరించింది. ఇందుకు ఆప్షన్ల మార్పునకు వెబ్‌సైట్లో అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇదివరకే తమ ఈ సమాచారాన్ని మార్పులు, చేర్పులు చేసుకున్న అభ్యర్ధులు మరోసారి వాటిని సరిచూసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకో వచ్చని తెలిపింది. ఇదే చివరి అవకాశమని, మరోసారి ఇందుకు ఆస్కార మివ్వబోమని స్పష్టంచేసింది. గ్రూప్‌-2, గ్రూప్‌-1, గ్రూప్‌-3 2016 నోటిఫి కేషన్లు మినహా తక్కిన అన్ని నోటిఫికేషన్లకు కమిషన్‌ పబ్లిష్‌చేసిన అంశాలే చివరి నిర్ణయమని స్పష్టంచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com