అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న యువ రైతు.ఎర్రం పేట పంచాయతీ శీవారు గ్రామం కనకాద్రిపురం కు చెందిన శ్రీ సుంకర నరసింహారావు s/o సత్యం, వయసు 32 సంవత్సరాలు,దేవరపల్లి మండలం యాదవులు గ్రామంలో కౌలుకు వ్యవసాయం చేస్తూ అప్పులు పాలవ్వడంతో అయోమయ పరిస్థితిలో ,15 సెప్టెంబర్ రాత్రి విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో, ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి , తరలించే క్రమంలో మార్గమధ్యలో ఆయన మృతి చెందారు. ఇతనికి భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు