ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కన్నుమూత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2019, 12:50 PM

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. హైదారాబాద్ లోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే గుర్తించిన ఇంట్లోని వ్యక్తులు ఆయన్ను బసవ తారకం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా అందుతున్న సమాచారం. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు స్వల్ప హార్ట్ అటాక్ కు గురయ్యారు. ఆ తరువాత అల్లుడు మనోహర్ ఆస్పత్రిలో చికిత్స పొంది కొద్ది రోజుల క్రితమే డిస్చార్జ్ అయ్యారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లోని ఇంటికి వెళ్లారు. కుమారుడు తో జరిగిన గొడవతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కోడెల కుమారుడు.


కుమార్తె పై వచ్చిన ఆరోపణలతో కోడెల తీవ్రంగా మనస్థాపానిక గురయ్యారు. కే టాక్స్ పేరుతో ఆయన కుటుంబం భారీగా వసూళ్లు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో ఫర్నీచర్ ను సైతం తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫర్నీచర్ ను అసెంబ్లీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ లు తప్పించుకొనేందుకు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. వరుసగా వస్తున్న వివాదాలు..ఆరోపణల పైన కుమారుడుతో చర్చ సమయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని సమాచారం.దీంతో..ఆయన అవమానాలు తట్టుకోలేక ఉరి వేసుకొని ఆత్మ హత్యకు ప్రయత్నించారు. ఇంట్లో పని చేసే వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తన ఇమేజ్ మొత్తం డామేజ్ అయినట్లుగా కోడెల కొద్ది రోజులుగా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన తాను ఉన్న పరిస్థితి తట్టుకోలేక పోతున్నానంటూ వాపోయారు. దీంతో...ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీని పైన ఆస్పత్రి అధికారిక బులెటిన్ విడుదల చేయాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com