వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ తన అన్ని ప్లాంట్లలోనూ ఉత్పత్తికి సెలవు ప్రకటించింది. తమ ఉత్పత్తులకు గిరాకీ తగ్గడంతో ఉత్పత్తులను నిలిపివేసింది. ఎన్నోర్ ప్లాంట్లో 16 రోజులు, హోసూర్ ప్లాంట్లో 5 రోజులు పనులను స్తంభింపజేస్తున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు అశోక్ లేలాండ్ సమాచారం అందించింది. పంత్నగర్ ప్లాంట్లో 18 రోజులు, అల్వార్, భందారా ప్లాంట్లలో 10 రోజుల చొప్పున ఉత్పత్తికి సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.