ఐటీ, ఈడీ దాడులకు.. రాజకీయాలకు సంబంధం లేదని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎవరు మా పార్టీలో చేరినా బీజేపీ డీఎన్ ఏ మారదన్నారు. బీజేపీలో చేరితే కేసులు మాఫీ అవుతాయనుకుంటే పొరపాటేనని మురళీధర్ రావు అన్నారు. బీజేపీలో చేరితే కేసుల నుంచి రక్షణ పొందవచ్చనుకునే వాళ్లకు ఆశాభంగం తప్పదన్నారు.