హిమాచల్ ప్రదేశ్ మాజీ మంత్రి అనిల్ శర్మను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. ఎవరైనా పార్టీ నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే..వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనిల్ శర్మ పార్టీ లైన్ ను దాటారు. దీంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ ఛుఘ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అనిల్ శర్మ కుమారుడు ఆశ్రయ్ శర్మను మండి (హిమాచల్ ప్రదేశ్) పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలబెట్టింది. లోక్ సభ ఎన్నికల సమయంలో మాజీ కేంద్రమంత్రి సుఖ్ రామ్ బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మాజీ కేంద్రమంత్రి సుఖ్ రామ్ కుమారుడే అనిల్ శర్మ.