ఎగువన తీవ్ర స్థాయిలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో కర్ణాటక లోని మైసూర్ జిల్లా, హెచ్డీ కోట్లో ఉన్న కబినీ డ్యామ్ గేట్లను ఎత్తివేసి, రిజర్వాయర్ నుంచి సుమారు 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదలు చేస్తున్నారు. బుధవారం క్యాచ్మెంట్ ఏరియాలో అలర్ట్ ప్రకటించి గేట్లు ఎత్తి వేసారూ. దీంతో క్యాచ్మెంట్ ఏరియాలో ప్రధానంగా ఉన్న కేరళలోని వయనాడ్ జిల్లాలో అప్రమత్తత ప్రకటించారు. మరో వైపు కొడగు జిల్లాలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నందున సుతార్ బ్రిడ్జ్ మునిగిపోయే అవకాశం ఉన్నట్లు డిప్యూటీ కమీషనర్ అభిరామ్ శంకర్ తెలిపారు.
కబినీ డ్యామ్లో ప్రస్తుతం వాటర్ లెవల్ 2281.5 ఫీట్లుగా ఉన్నది. డ్యామ్ పూర్తి స్థాయి 2284 ఫీట్లు. గత ఏడాది కూడా ఇదే సమయానికి నీటి విడుదల 80 వేల క్యూసెక్కులు ఉన్నది. దీంతో అప్పట్లో అక్కడ వరదలు వచ్చాయి. యిపుడు కూడా అదే పరిస్థితి నెలకొనడంతో కబినీ పరివాహక ప్రాంతంలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
.