ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెస్టారెంట్‌లో పోలీసుల తనిఖీలు.. బాత్రూంలో సీక్రెట్ డోర్.. తెరిచి చూసి షాక్

national |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 09:14 PM

అసాంఘిక కార్యకలాపాలకు లాడ్జ్‌లు, ఓయో రూంలు అడ్డాగా మారుతున్న విషయం మనం నిత్యం ఏదో ఒక దగ్గర చూస్తూనే ఉన్నాం. కానీ తాజాగా ఓ రెస్టారెంట్ యజమాని కొత్తగా ఆలోచించి.. సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. రెస్టారెంట్‌లో ఫుడ్ మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల సౌకర్యాలు అందిస్తున్నాడు. అయితే ఆ రెస్టారెంట్‌లో జరుగుతున్న చీకటి వ్యాపారం కాస్తా పోలీసులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. మొదట ఆ రెస్టారెంట్‌ను పూర్తిగా తనిఖీ చేసిన పోలీసులకు ఏం దొరకలేదు. అయితే అనుమానం వచ్చి బాత్రూం డోర్ తీయగా.. అసలు విషయం బయటికి వచ్చింది. ఆ సీక్రెట్ డోరు వెనకాల పెద్ద వ్యభిచార కూపమే నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ సంఘటన బీహార్‌లో జరిగింది.


భాగల్పూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో లైంగిక కార్యకలాపాలు సాగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ రెస్టారెంట్‌పై దాడి చేశారు. ఆ రెస్టారెంట్‌లోని ప్రతీ మూల తనిఖీ చేశారు. చివరికి బాత్రూంలో అసలు గుట్టు బయటపడింది. బాత్రూంలో సీక్రెట్ డోర్ ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ఓనర్.. దాని వెనక చీకటి సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేశాడు. అందులో ఓ గది వారికి కనిపించింది. అందులో క్యాబిన్లు ఏర్పాటు చేసి.. యువతీయువకులకు గంటల చొప్పున అద్దెకు ఇస్తూ అక్రమంగా సంపాదిస్తున్నాడు. అవి చూసి పోలీసులే షాక్ అయ్యారు.


ఆ క్యాబిన్లలో అభ్యంతరకమైన స్థితిలో ఉన్న ముగ్గురు ప్రేమ జంటలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని విచారణ జరిపిన తర్వాత ముగ్గురు యువతులను వారి ఇంటికి పంపించేశారు. ఇక యువకుల కుటుంబ సభ్యులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకూడదని వారికి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు.


ఇక ఆ సీక్రెట్ రూంలో క్యాబిన్లలో ఏర్పాటు చేసి అందులో బెడ్లు కూడా ఉంచినట్లు భాగల్పూర్ ఎస్పీ వెల్లడించారు. మొదట తాము ఆ సీక్రెట్ రూంను గుర్తించలేదని.. కానీ రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్లే ప్రాంతంలో ఉన్న ఓ బాత్రూం అనుమానాస్పదంగా కనిపించినట్లు తెలిపారు. వెంటనే అందులోకి వెళ్లి చూడగా.. ఆ బాత్రూంలో నుంచి సీక్రెట్ గదికి దారిని కనుగొన్నట్లు చెప్పారు. ఆ సీక్రెట్ రూంలో ఏర్పాటు చేసిన క్యాబిన్లను గంటల లెక్క అద్దెకు ఇస్తున్నట్లు గుర్తించారు. డిమాండ్‌ను బట్టి ఒక్కో క్యాబిన్‌ను గంటకు రూ.500 నుంచి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ రెస్టారెంట్ యజమాని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఆ రెస్టారెంట్ ఓనర్‌పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే ఆ రెస్టారెంట్‌లో ఇలాంటి చీకటి వ్యాపారం జరుగుతున్నట్లు గత కొన్ని రోజులుగా తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఒకరోజు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నట్లు భాగల్పూర్ ఎస్పీ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com