పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రీనిత్ కౌర్ బ్యాంకు ఖాతాలో నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 23 లక్షలను మాయం చేసైనా ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాంగ్రెస్ ఎంపీగా ప్రీనిత్ కౌర్కు కొద్ది రోజుల క్రితం. ఓ వ్యక్తి ఫోన్ చేసి, తనని తాను బ్యాంకు మేనేజర్గా పరిచయం చేసుకొని. మీ ఖాతాలో జీతం డబ్బులు జమ చేయాలని.. ఖాతా వివరాలు ఇవ్వాలని ఆమెను కోరాడు. దీంతో ఆమె బ్యాంకు ఖాతా వివరాఆలు అందించగా ఆపై ఏటీఎం నెంబర్, పిన్ నంబర్, సీవీసీ నంబర్, ఓటీపీలను అడగటంతో అతనికి చెప్పింది. ఐతే కాసేపటికి ఆమె ఖాతాలో నుంచి రూ. 23 లక్షలు డెబిట్ అయినట్లు మొబైల్కు ఎస్ఎంఎస్ రావటంతో, తనని తప్పుదోవ పత్తినిచి పెద్దమొత్తం తన ఖాతా నుంచి మాయం చేసినట్టు బాధిత ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, సదరు బ్యాంకు మేనేజర్ సిబ్బందిని విచారించగా ఇది . సైబర్ నేరగాళ్లు మోసం గా గుర్తించారు . ప్రీనిత్ కౌర్కు ఫోన్ చేసిన నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి కేసును చేధించారు.జార్ఖండ్ నుంచి ఆ సైబర్ నేరగాడు ఫోన్ చేసినట్లు గుర్తించి అక్కడకు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.