త్వరలో హైసెక్యూరిటీ ఫీచర్లతో కూడిన చిప్ ఆధారిత ఈ-పాస్పోర్ట్లు జారీకానున్నాయి. వీటిని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రాజ్యసభలో విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఓ ప్రశ్నకు సమాధానం తెలియజేస్తూ.. ఈ-పాస్పోర్ట్ల తయారీ కోసం అవసరమైన పరికరాల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. నాసిక్లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్(ఐఎస్పీ) దీనికోసం త్వరలో గ్లోబల్ టెండర్లను ఆహ్వానించనున్నదన్నారు. దరఖాస్తుదారుడికి సంబంధించిన డిజిటల్ సంతకంతోపాటు ఇతర వివరాలన్నీ చిప్లోనే పొందుపరుస్తారని ఆయన తెలిపారు.