గుంటూరు కల్చరల్: క్రేన్ సంస్థల అధినేత, సుప్రసిద్ధ పారిశ్రామిక వేత్త, ఆధ్యాత్మిక రంగ ప్రముఖుడు గ్రంధి సుబ్బారావు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఈరోజు ఉదయం స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు వక్కపొడి తయారీలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న ఆయన ‘వివాహాది శుభకార్యాలకు క్రేన్ వక్క పలుకులు’ అనే నినాదంతో అందరికీ సుపరిచితులు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో రాష్ట్రేతర ప్రాంతాలలో ఎన్నెన్నో దేవాలయాలను నిర్మించారు. అన్నదాన సత్రాలను నెలకొల్పారు. ముఖ్యంగా అయ్యప్పస్వామి దీక్షా పరులకు దీక్షను ఏర్పాటు చేయడంలో మంచిపేరు తెచ్చుకున్నారు. భక్తుడిగా, పారిశ్రామిక వేత్తగా, అందరి మనుసుల్లో నిలుస్తూ గొప్ప దాతగా కీర్తి గడించారు.