న్యూజెర్సీ: అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ ఇంట్లోనే ఇద్దరు తెలుగువారు దారుణ హత్యకు గురయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి ఆయన భార్య శశికళ(40), కొడుకు హనీశ్ సాయి(7) రక్తపు మడుగులో విగత జీవులుగా పడివున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంలోని హనుమంతరావు బంధువులకు ఈ మేరకు సమాచారం అందింది. కుటుంబసభ్యుల మృతితో వారి కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.