జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తరహాలో బీసీలకు కూడా ప్రత్యేక కమిషన్ ఉండాలని కేంద్రం భావిస్తోంది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రుల నుంచి విజ్ఞప్తులు వస్తుండడంతో చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలోని 338-బీ అధికరణాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నందున బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఉన్న జాతీయ బీసీ కమిషన్ను, ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి రాజ్యాంగ ప్రతిపత్తి కలిగి ఉండేలా జాతీయ సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్ ఉనికిలోకి రానుంది.