ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌కు బీఎస్పీ ఝలక్

national |  Suryaa Desk  | Published : Mon, Dec 31, 2018, 06:47 PM

న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అప్పుడే కాంగ్రెస్‌కు ఝలక్ ఇస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ 2న భారత్ బంద్ సందర్భంగా నమోదు చేసిన కేసులను కొట్టేయకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని ఆ పార్టీ చీఫ్ మాయావతి హెచ్చరించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీఎస్పీ మద్దతుతోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. భారత్ బంద్ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్‌కు ఇచ్చిన మద్దతుపై పునరాలోచిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధ చట్టానికి కేంద్రం మార్పులు చేయడానికి ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 2న భారత్ బంద్ జరిగింది. ఇది హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్తంగా పది మంది మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో హింస ఎక్కువగా జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com