ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో జడ్జీల ప్రమాణస్వీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 31, 2018, 07:04 PM

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు అంటూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఏపీ న్యాయవాదులు ఈరోజు విజయవాడకు తరలివెళ్లారు. రేపటి నుండి రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు కార్యకలాపాలు కొనసాగనున్నాయి. విజయవాడ నోవాటెల్లో వీరికి బస ఏర్పాట్లు చేయగా రేపు ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో జడ్జీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ నరసింహన్ విజయవాడకు చేరుకోనుండగా కాసేపటిలో న్యాయవాదులంతా అమరావతికి చేరుకోనున్నారు. వీరికి స్థానిక న్యాయాధికారులు స్వాగత ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతానికి సీఎం కార్యాలయంలో హైకోర్టు కొనసాగనుండగా తగిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతుండగా.. హైకోర్టు శాశ్వత భవనం పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com