ఢిల్లీ: జాతీయ అగ్రికల్చర్ సైన్స్ ఫెయిర్ రేపు ఢిల్లీలో ప్రారంభం కానుంది. 15 నుంచి 17వ తేదీ వరకు సైన్స్ ఫెయిర్ నిర్వహణ. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఐఏఆర్ఐ) క్యాంపస్లో ప్రతి ఏడాది జరిగే ఈ ప్రదర్శనను ఐసీఏఆర్, వ్యవసాయ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో వచ్చిన సాంకేతిక అభివృద్ధి, సరికొత్త పరిశోధనలు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. దేశవ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఈ ఫెయిర్ను తిలకించి విలువైన సమాచారం తెలుసుకోవడంతో పాటు తమ స్పందనలను తెలియజేయనున్నారు. దీని ద్వారా రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో భవిష్యత్ పరిశోధనలపై నిర్వాహాకులు దృష్టి సారించనున్నారు.