ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో ప్రారంభం కానున్న జాతీయ అగ్రికల్చర్ సైన్స్ ఫెయిర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2017, 07:54 PM

ఢిల్లీ: జాతీయ అగ్రికల్చర్ సైన్స్ ఫెయిర్ రేపు ఢిల్లీలో ప్రారంభం కానుంది. 15 నుంచి 17వ తేదీ వరకు సైన్స్ ఫెయిర్ నిర్వహణ. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఐఏఆర్‌ఐ) క్యాంపస్‌లో  ప్రతి ఏడాది జరిగే ఈ ప్రదర్శనను ఐసీఏఆర్, వ్యవసాయ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో వచ్చిన సాంకేతిక అభివృద్ధి, సరికొత్త పరిశోధనలు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. దేశవ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఈ ఫెయిర్‌ను తిలకించి విలువైన సమాచారం తెలుసుకోవడంతో పాటు తమ స్పందనలను తెలియజేయనున్నారు. దీని ద్వారా రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో భవిష్యత్ పరిశోధనలపై నిర్వాహాకులు దృష్టి సారించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com