ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు జనం పోటెత్తారు. ఆయన దీక్షకు పలు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బాబు దీక్షకు సంఘీభావంగా దీక్షలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, 96 ఏళ్ల వయోవృద్ధుడు శివరామకృష్ణ చంద్రబాబుకు పూలమాల వేసి విజయుడిగా నిలవాలని ఆశీర్వదించారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని 13 జిల్లాలలోనూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దీక్షలు సాగుతున్నాయి