హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లపై ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. తనపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. తన తల్లిని కూడా దూషించే విధంగా తనను తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడినందుకు తనకు దక్కిన ప్రతిఫలమిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియెట్ వేదికగా ఆరు నెలలుగా తనపై కుట్ర జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, లోకేష్ స్నేహితుడు రాజేష్ తో కలిసి తనపై కుట్రపన్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. తన తల్లి గౌరవాన్ని కాపాడుకోలేకుంటే తాను చనిపోవడం మంచిదని పవన్ కల్యాణ్ అన్నారు.