విజయవాడ: ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరుగుతున్న దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకల్లో చంద్రబాబు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాలను అడ్డుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్ట సవరణకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేస్తామన్నారు. బాబూ జగ్జీవన్రామ్ అతి చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జగ్జీవన్రామ్ వివిధ పదవులు అలంకరించి ప్రజాప్రయోజనాలు కాంక్షించారన్నారు. ఆహార భద్రతకు నాంది పలికింది బాబూ జగ్జీవన్రామ్ అన్నారు. ఎన్డీయే నుంచి వైదొలిగే విషయంలో తాము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రం ఏపీ ప్రజలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఏపీ ప్రగతికి, అభివృద్ధికి కేంద్రం సహకరించకపోవడం వల్లనే బయటకు వచ్చామని స్పష్టం చేశారు. దళితుల జీవన ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల కుటుంబాల్లో తాను పెద్దకుమారుడిగా ఉంటున్నాన్నారు. మీ అందరీ బాగోగులు చూసేందుకు నిత్యం కష్టించి పని చేస్తున్న ప్రభుత్వం మాది అని పేర్కొన్నారు.