గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ మెరుగైన చికిత్స కొసం నేడు అమెరికా బయలుదేరి వెళుతున్నారు. 62ఏళ్ల పారికర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చికిత్స కోసం తాను అమెరకా వెళుతున్నట్లు గోవా గవర్నర్ మృదుల్ సిన్హాకు లేఖ రాశారు. గోవా వైద్య నిపుణుల సూచన మేరకే తాను అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.