పంజాబ్: పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ అక్రమ మైనింగ్ (ఇసుక తవ్వకం) జరుగుతున్నట్లు గుర్తించారు. సీఎం అమరిందర్ సింగ్ హెలికాప్టర్లో కర్తార్పూర్కు వెళ్తున్నారు. మార్గమధ్యలో ఫిల్లౌర్, రహన్ ప్రాంతాల మధ్యలోని సట్లేజ్ తీర ప్రాంతంలో 21 యంత్రాలతో అక్రమ తవ్వకాలను చేపడుతున్నట్లు గుర్తించారు. అక్రమ మైనింగ్పై విచారణ జరుపాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు.