షిల్లాంగ్ :మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పిపి) ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్పిపి అధ్యక్షుడు కొన్రాడ్ కె సంగ్మా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఈ సమావేశంలో తాము ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. భావసారూప్యం కలిగిన ఇతర పార్టీలతో ఇప్పటికే మాట్లాడామని, వారు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ నిర్ణయాలను వెల్లడించనున్నారని ఆయన అన్నారు. రెండు మూడు గంటల్లో స్పష్టత వస్తుందన్నారు. మేఘాలయ ఎన్నికల్లో ఎన్పిపి 19 స్థానాల్లో విజయం సాధించింది.