పాకిస్తాన్ రేంజర్లు పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతున్నారు. తాజాగా జమ్ము కాశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణాధీన రేఖ వద్ద భారతదేశంలోని గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. బాలకోట్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారని, గత అర్థరాత్రి సుమారు రెండు గంటలపాటు కాల్పులు జరిపారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా ఈ కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారు? ఎవరైనా మరణించారా? అనే విషయాలపై సమాచారం అందాల్సి ఉందని ఆ అధికారి అన్నారు.