న్యూఢిల్లి : ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్, చైనా దేశాల అధికారులు సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. మోడీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య మరింత సుహృద్భావ వాతావరణం నెలకొనేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇరు దేశాల అధికారులు వరుస సమావేశాలతో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి కృషి చేస్తున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.