ముప్పాళ్ల: గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ముప్పాళ్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించారు. వీరంతా సత్తెనపల్లి నుంచి చీరాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడు అశోక్ సతైనపల్లి డీఎస్పీ కార్యాలయం కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.