అమరావతి: సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అసెంబ్లి సమావేశాల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పనపై, అసెంబ్లిలో పెట్టాల్సిన బిల్లులు తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఈ నెల 23న కేంద్ర హోంశాఖ వద్ద చర్చించాల్సిన అంశాలపై సైతం చర్చించనున్నారు. ఉద్యోగుల ఒక డీఏ విడుదలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విశాఖలో భాగస్వామ్య సదస్సు, రేపటి కియా శంకుస్థాపన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నారు.