న్యూఢిల్లీ : మాల్దీవుల అంతర్గత సంక్షోభం నేపథ్యంలో స్పైస్జెట్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 'మాలే నుండి ఇతర దేశాలకు, ఇతర దేశాల నుండి మాలేకు ప్రయాణించే ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవచ్చు. మొత్తం టికెట్ ఛార్జీల్ని తిరిగి చెల్లిస్తాం. రద్దు చేసేందుకయ్యే ఛార్జీలు కూడా చెల్లించనవసరం లేదు' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం మాల్దీవుల్లో నెలకొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ప్రయాణం చేయడం ఇష్టం లేని వారికి ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఎయిర్ ఇండియా కూడా ఇప్పటికే ఈ నిర్ణయాన్ని తీసుకుంది.