ఆరంభం నుంచి మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న ఫోన్.. జియో 4జీ . ముఖేష్ అంబానీ ఈ ఫోన్ గురించి ప్రకటన చేసినప్పటి నుంచి దీని కోసం వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఈ ఫోన్కు గాను మొదటి సారి నిర్వహించిన సేల్లో ఈ ఫోన్ను కొన్ని లక్షల మంది కొనుగోలు చేశారు. దాంతో మొదటి సారి జియో ఫోన్ల అమ్మకం ముగిసింది. అయితే తిరిగి ఈ ఫోన్లను ఎప్పుడు అమ్ముతారో జియో ఇప్పటి దాకా వెల్లడించలేదు. కానీ తాజాగా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండానే ఈ ఫోన్ అమ్మకాలను జియో మళ్లీ సైలెంట్గా ప్రారంభించింది. జియో వెబ్సైట్లో ఇప్పుడు జియో 4జీ ఫీచర్ ఫోన్ను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఆ సైట్ను ఓపెన్ చేస్తే అందులో జియో ఫోన్ విభాగంలో గెట్ నౌ అనే ఆప్షన్ దర్శనమిస్తోంది. అందులో ఫోన్ నంబర్, పిన్కోడ్ ఎంటర్ చేసి ముందుకు సాగితే రూ.1500 పేమెంట్ చేసి డెలివరీ అడ్రస్ ఇవ్వాలంటూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి తెలుస్తుందేమిటంటే.. జియో ఫోన్కు రెండో దఫా అమ్మకాలు మళ్లీ ప్రారంభమయ్యాయని మనం గమనించవచ్చు.