ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మను ప్రతి ఒక్కరు గౌరవించాలి : సునీత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 02:37 PM

   అనంతపురం: అమ్మను ప్రతి ఒక్కరూ గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. రామగిరి మండలం, వెంకటాపురంలోని అంగన్‌ వాడీ కేంద్రంలో అమ్మకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నసనకోటలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ కార్యక్రమంలో పాల్గన్నారు. తల్లి కాళ్లు కడిగిన విద్యార్థులు, ఆశీర్వదించిన తల్లులు. ఈ సందర్భంగా మంత్రి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారికి తల్లులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గత ఏడాది అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్ల మెంట్‌ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా ''అమ్మకు వందనం' కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. పాఠశాలలకు తల్లిని గౌరవంగా తీసుకువచ్చి ఆమె కాళ్లు కడిగించడం అంటే బిడ్డలకు తల్లిని గౌరవించే సంస్కతిని బోధించడమే ఈ కార్యక్రమ విశేషమని తెలియజేశారు. సరస్వతీదేవి పుట్టిన రోజు వసంత పంచమిని పరష్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని 5వేల ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com