మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. గ్వాలియర్లో, 16 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా తమ స్నేహితుడికి లైమ్ స్ట్రీమింగ్ పెట్టారు. ఆ యువతి ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్లో పోస్టు చేశారు. జూన్ 2న దాదాపు 21 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు తనను హోటల్కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు పరారీలో ఉండడంతో వారి కోసం గాలిస్తున్నారు.