అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని మురుగు కాలువల వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన తమపై దాడి చేశారని మీడియా ప్రతినిధుల ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు హర్షవర్ధన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.