లంగర్ హౌస్ బాపూఘాట్ వద్ద రెచ్చిపోయిన విద్యార్థులు. దుర్గాప్రసాద్ అనే పదో తరగతి విద్యార్థిపై మరో ఇద్దరు విద్యార్థులు కత్తులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో 10వ తరగతి విద్యార్థులు పార్టీ చేసుకున్నారు. దుర్గా ప్రసాద్ కు మాయ మాటలు చెప్పి మోటర్ సైకిల్ పై రాజేంద్రనగర్ అత్తాపూర్ లోని మూసి వద్దకు తీసుకుని వచ్చి దుర్గాప్రసాద్పై కత్తులతో దాడి చేయగా దుర్గాప్రసాద్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో దుర్గాప్రసాద్ కేకలు వేయడంతో ఇద్దరు పరారయ్యారు. దుర్గాప్రసాద్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు . ప్రియురాలికి హాయ్ చెప్పాడన్న అక్కసుతో కత్తితో దాడి చేశాడు. దాడికి సంబంధించిన దృశ్యాలను విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులు సెక్షన్ 307 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.