టీమిండియా టీ20 కెప్టెన్గా తప్పుకోనున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు కెప్టెన్ గా ఉండనని ప్రకటించాడు. ఈ సీజన్ మ్యాచ్లు పూర్తికాగానే కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లీ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. తన లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ అయిపోయేవరకు ఆర్సీబీ జట్టులోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. కెప్టెన్గా తనకు ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని పేర్కొన్నాడు. ఇన్నేళ్లుగా తనకు సహకరించిన ఆర్సీబీ ఫ్యాన్స్ కు కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు.