ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే స్టేషన్ సమీపంలోని హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం, పదులసంఖ్యలో గాయాలు

national |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 09:09 PM

బీహార్ రాజధాని పాట్నాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో గురువారం ఉదయం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో హోటల్‌లో కస్టమర్ల రద్దీ ఉండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి కాస్తా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. ఈ ఘటనలో ఆరుగురు కాలి బూడిదయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. అయినప్పటికీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అయితే అధికారులు రంగంలోకి దిగి పలువురిని రక్షించారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.


మొదట హోటల్‌లో మంటలు చెలరేగగా.. అవి పక్కనే ఉన్న మరో 2 భవనాలకు వ్యాప్తి చెందినట్లు అగ్నిమాపక శాఖ డీఐజీ మృత్యుంజయ్ కుమార్ వెల్లడించారు. సమాచారం తెలియగానే వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నట్లు తెలిపారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశామని.. ఫైర్ సిబ్బంది.. హోటల్ లోపలికి వెళ్లి అందులో ఉన్న వారిని బయటికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అందులో కొందరు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. హోటల్‌ నుంచి సుమారుగా 30 మందిని కాపాడినట్లు ఆయన తెలిపారు.


అయితే ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు, ఫైర్ అధికారులు ఆరా తీస్తున్నారు. హోటల్‌లోని సిలిండర్‌ పేలడంతోనే ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక చనిపోయిన వారిని గుర్తించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. వారి వద్ద ఉన్ ఐడెంటిటీ కార్డులు, హోటల్‌లో ఇచ్చిన వివరాల ఆధారంగా వారి బంధువులకు సమాచారం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com