జగన్ సర్కార్ గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాని అదాని కంపెనీకి అమ్మడాన్ని ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో జతకట్టి ప్రైవేటు పాట పాడుతోందని విమర్శించారు. గంగవరం పోర్టులోని 10.4 శాతం వాటాని రూ.644.78 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాని, అంబానీలకు ఊడిగం చేయటంకాక ఏమనాలని రామకృష్ణ మండిపడ్డారు.