ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జర్మనీలో పిజ్జా అమ్ముకుంటున్న ఆఫ్ఘన్​ మంత్రి

international |  Suryaa Desk  | Published : Wed, Aug 25, 2021, 04:44 PM

ఆయన పేరు సయ్యద్ అహ్మద్ షా సాదత్. మొన్నటిదాకా ఆయన ఆఫ్ఘనిస్థాన్ సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ, అంతపెద్ద హోదా నుంచి ఒకేసారి పిజ్జా డెలివరీ బాయ్ గా మారిపోయారు. ప్రస్తుతం జర్మనీలోని లీప్జిగ్ లో ఓ పిజ్జా తయారీ సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. ఆయన ఫొటోలను స్థానిక విలేకరి ఒకరు క్లిక్ మనిపించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సైకిల్ పై స్థానికంగా పిజ్జాలను డెలివరీ చేస్తూ కనిపించారాయన. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తిని కలిశానని, రెండేళ్ల కిందట తాను ఆఫ్ఘనిస్థాన్ మంత్రినంటూ చెప్పారని ఆ జర్నలిస్టు ట్వీట్ లో పేర్కొన్నారు. 2018లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో తాను మంత్రిగా పనిచేసినట్టు సయ్యద్ అహ్మద్ షా సాదత్ చెప్పారు. 2020 వరకు రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశానని వివరించారు. ఆ తర్వాత రాజీనామా చేసి గత ఏడాది డిసెంబర్ లో జర్మనీకి వచ్చేశానన్నారు. ఇక, ఆయనకు కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో రెండు పీజీలున్నాయి. ఘనీ ప్రభుత్వం ఇంత వేగంగా కూలిపోతుందని అనుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com