ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రెండో టెస్టులో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిరిస్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, క్రెయిగ్ ఒవర్టన్, జేమ్స్ అండర్సన్.