చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. జిల్లాలోని 20 ప్రాజెక్టుల పరిధిలో 484 పోస్టులు భర్తీ చేయనుండగా, వీటిలో 110 అంగన్వాడీ కార్యకర్తలు, 65 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 309 మంది సహాయకులు(ఆయాలు) నియామకాలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపారు. పోస్టులు భర్తీ చేయనున్న సీడీపీఓ కార్యాలయాల్లో అంగన్వాడీ కేంద్రాల వారీగా ఖాళీలు, రోస్టర్ వివరాలు అందుబాటులో ఉంచనున్నారు. గ్రామ, వార్డు పరిధిలో ఉన్న స్థానిక వివాహితులు, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, 2021 జులై 1వ తేదీకి 21 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రోస్టర్ను అనుసరించి సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో ఈనెల 26వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి సెప్టెంబరు 9వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు https:chittoor.ap.gov.in వెబ్సైట్లో ఉంచనున్నట్లు తెలిపారు.