ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడే పుట్టిన పిల్లలకు కరోనా ముప్పు తక్కువే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 18, 2021, 03:34 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈసారి పసివాళ్లనుంచి కరోనా ముప్పు అధికమని తేలింది. కెనడాకు చెందిన ఓ హెల్త్ ఏజెన్సీ జరిపిన సర్వే ప్రకారం 14 నుంచి 17 ఏళ్ల పిల్లలకు కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని, జీరో నుంచి మూడేళ్ళ వయసు ఉన్న పిల్లలకు ఈ ప్రమాదం తక్కువని సర్వే చెప్పింది. అయితే పసివాళ్లకు ఒకసారి సోకిందంటే మాత్రం ప్రమాదకరమని తెలిపింది. పసివాళ్ల నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశం 43 శాతం ఎక్కువగా ఉన్నట్లు చెబుతోంది. అయితే ఇదేం కొత్త విషయం కాదని నిపుణులు అంటున్నారు. పసివాళ్లకు వైరస్ సోకితే వారిని ఐసోలేట్ చేసే అవకాశం ఉండదని, వారి సంవరక్షకులు, తోబుట్టువులకు కరోనా సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 14 నుంచి 17 ఏళ్ల వయస్సు పిల్లలకు కోవిడ్ బయట సోకవచ్చునని, అప్పుడే పుట్టిన పిల్లలు మూడేళ్ల లోపువారికి ఈ ప్రమాదం తక్కువని సర్వేలో తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com