ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు చేజిక్కించకోవడంతో అక్కడ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. తాజాగా కాబూల్ లో కర్ఫ్యూ విధించారు. తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయని అక్కడి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి నానాటికీ దారుణంగా మారడంతో భారత ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అక్కడి నుంచి భారత రాయబారి, రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కి వచ్చేయమని కేంద్ర ప్రభుత్వం కోరింది. వీలైనంత త్వరగా వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల ఆర్తనాధాలతో అప్ఘానిస్థాన్ లో హృదయవిధారక పరిస్థితులు నెలకొన్నాయి.