మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నెహ్రూ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నెహ్రూ ఆరోగ్య పరిస్థితిపై అధినేత చంద్రబాబు ఆరా తీశారు.