తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ ఆలయాల్లో వాడిన పుష్పాలతో సుగంధాలు వెదజల్లే అగరబత్తులు తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ నుండి వీటిని తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంతో పాటు టీటీడీ ఆలయాల్లో విక్రయానికి అందుబాటులో ఉంచుతారు. ఏడు రకాల బ్రాండ్లతో అగరబత్తులు తయారు చేయనున్నారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గో సంరక్షణకు వినియోగిస్తారు.