విశాఖపట్నం, మే 12 : దేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులు అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కెజిహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలిపారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ కె మదీనా మాట్లాడుతూ ఐదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో నర్సులు గా విధులు నిర్వహిస్తున్న వారికి నెలకు రూ. 22,500 జీతం ఇస్తున్నారని చెప్పారు. అయితే 2020 సెప్టెంబర్ లో కొత్తగా కాంట్రాక్టు నర్సులను తీసుకున్నారని, వారికి నెలకు రూ.34 వేలు వేతనంగా ఇస్తున్నారని, వారి వలే తమకు కూడా రూ.34వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 160 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సులు పని చేస్తున్నారని, రాష్ట్రంలో1000మంది పనిచేస్తున్నారని తెలిపారు.