హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే అంశం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పై తమకు ఇంకా మూడేళ్ల హక్కు ఉందని ఏపీ నేతలు చెప్పడం సంచలనంగా మారింది. ఉన్నట్టుండి ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి రావడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణం. ఏపీ నుంచి వస్తున్న కరోనా రోగుల అంబులెన్సులను తెలంగాణ బార్డర్ నుంచే వెనక్కి పంపుతున్నారు. తెలంగాణ సర్కార్ విధించిన ఆంక్షలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఉందని ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం కోసం వస్తున్న వారిని అడ్డుకోవడం సరికాదని ఏపీ నేతలు మండిపడుతున్నారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇంకా మూడేళ్ల వ్యవధి ఉందని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విమర్శించారు. ఉమ్మడి రాజధానిపై మరి తెలంగాణ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.