ఉత్తరాంధ్రలో కూటమికి ప్రజల మద్దతు బాగుందని నట్టి కుమార్ వెల్లడించారు. శ్రీకాకుళంలోని 8 అసెంబ్లీ స్థానాలు కూటమివేనని ఆయన స్పష్టం చేశారు. ఇక విశాఖ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో మాత్రం నువ్వా నేనా అనేలా పోటీ ఉంటుందన్నారు. వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలోని వైసీపీ ప్రముఖులు సిదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలకు ఓటమి తప్పదన్నారు.