ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మే 17వ తేదీన లండన్కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య భారతి కూడా లండన్ ట్రిప్కు వెళ్లనున్నారు. మే 13వ తేదీన పోలింగ్ పూర్తవుతుంది. పోలింగ్ పూర్తవగానే లండన్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు జగన్. లండన్ ప్రయాణ కోసం ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు జగన్. ఈ పిటిషన్పై గురువారం నాడు కోర్టులో విచారణ జరగనుంది.