ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరస్ సోకిన మూడు రోజులకే ఎమ్మెల్యే మృతి

national |  Suryaa Desk  | Published : Mon, Apr 19, 2021, 10:29 AM

కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను పొట్టనబెట్టుకున్న ఈ మాయదారి వైరస్ మరో ఎమ్మెల్యేను బలి తీసుకుంది. బీహార్‌లో మాజీ మంత్రి, జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి కరోనా సోకిన మూడు రోజులకే మృతి చెందారు. మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన సోమవారం ఉదయం ప్రాణాలు విడిచాడు. కాగా ఎన్డీయే-జేడీయూ ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మూడు రోజులకే ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com